ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 1నే అందరికీ పెన్షన్లు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ కారణంగా ఆదాయం లేమి, తీవ్ర ఇబ్బందుల సమయంలో సీఎం ప్రకటించిన విధంగా ఏప్రిల్ 4న ప్రతి నిరుపేద కుటుంబానికీ 1000₹ల చొప్పున పంపిణీ చేయనున్నారు. విపత్తులో నిరుపేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాసటగా ఉంటుందన్నారు. మార్చి 29 నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పు ఉచితంగా అందజేయనున్నారు. ఏప్రిల్ 15న మరోసారి ఉచిత రేషన్, అప్పుడు కూడా ఉచితంగా కేజీ కందిపప్పు ఇస్తామన్నారు.
ఏప్రిల్ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు, కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని కార్డులకూ ఇవ్వనున్నారు. ఆమేరకు అదనపు ఖర్చును భరించి
కరోనా సమయంలో పేదలెవ్వరికీ ఇబ్బంది రాకుండా పంపిణీ చేయనున్నారు.
అంతేకాక ఎప్పటిలాగానే ఏప్రిల్ ఒకటో తేదీనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను డోర్ డెలివరీ చేయనున్నారు.వీటితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ ప్రకటించిన విధంగా ప్రతి నిరుపేద కుటుంబానికీ 1000₹ల చొప్పున ఏప్రిల్ 4వ తేదీన ఆర్థిక సహాయం చేయనున్నారు. గ్రామ వాలంటీర్ల నేరుగా డోర్ డెలివరీ చేయనున్నారు. లాక్డౌన్ సందర్భంగా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు, కొనుగోళ్లు నిలిచిపోయినా, రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ, పెన్షనర్లను, పేదకుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం శ్రీ వైయస్.జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.