రెండో రోజు ఢిల్లీలో సీఎం పర్యటన
రెండో రోజు ఢిల్లీలో సీఎం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలసారు. ఏపి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల వెంటనే చేయాలని ముఖ్యంగా విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చ చేయడం జరిగింది. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని తెలిపిన సీఎం, సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్కారిడర్ ప్రాజెక్టులకు సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుందని,
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని ముఖ్యమంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు. విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని కోరడం జరిగింది. అలాగే విజవాడ తూర్పు బైపాస్పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని, కేంద్రంలోని సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న, ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులిస్తామని అందుకే
వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.
కత్తిపూడి – ఒంగోలు కారిడర్లో భాగంగా ఎన్హెచ్–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని కోరిన సీఎం. విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్బేస్ కారణంగా మళ్లీ ట్రాఫిక్జామ్స్ ఏర్పడే అవకాశం ఉందని, ప్రస్తుతం బాపట్ల ద్వారా వెళ్తున్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలంటూ విజ్ఞప్తి కేంద్ర రహదారులు శాఖా మంత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది.