తెలంగాణ గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన 11 మందికి పూర్తిగా నయమైందని మంత్రి కేటీఆర్ చెప్పారు. TSలో 67 పాజిటివ్ కేసులు ఉండగా 11మంది ఆరోగ్యంగా ఉన్నారని కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని కొద్ది రోజుల్లోనే వాళ్ళను డిశ్చార్జి చేయబోతున్నట్టు ట్విట్టర్ లో తెలిపారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ 145 మొబైల్ రైతు బజార్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.