ఉదయం 9 గంటలవరకూ 1,02,460 పరీక్షలు
ప్రతి మిలియన్ కూ 2 వేలకు చేరువలో పరీక్షలు
నెలరోజుల్లో సత్తా చాటిన వైద్యారోగ్యశాఖ
ఓ ల్యాబ్ నుంచి ప్రారంభమై లక్ష పరీక్షలు స్థాయికి
మరణాలను తగ్గించడంపై కసరత్తు
త్వరలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండలస్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులు
మంచి మార్కెటింగ్, ధరలే లక్ష్యంగా అడుగులు
కోవిడ్-19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష
కోవిడ్-19 నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు.
క్వారంటైన్ కేంద్రాలపై నిరంతర పరిశీలన: సీఎం ఆదేశం
క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలి. వీటిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుకు సూచించారు. సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం, మందులు అందుతున్నాయా లేదా అన్నదానిపై క్వారంటైన్లో ఉన్నవారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నామరు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్ నంబర్ తమ వద్ద ఉందని, కమాండ్ కంట్రోల్ నుంచి ర్యాండమ్గా కాల్చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు తెలిపారు.
ఇతర దేశాలు, రాష్ట్రాలనుంచి వచ్చేవారికి స్క్రీనింగ్, అవసరమైన వారికి క్వారంటైన్:
లాక్డౌన్ సడలింపులు నేపథ్యంలో విదేశాలనుంచి, ఇతరరాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు న్నాయని సమావేశంలో చర్చ, వీరిని స్క్రీనింగ్ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్కు తరలించడం తదితర అంశాలపై సమీక్షా సమావేశంలో విస్తృత చర్చ, వీరి సంఖ్య అధికంగా ఉండే అవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఎవరిని క్వారంటైన్లో పెట్టాలి, ఎవర్ని ఎక్కడ పెట్టాలని పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేస్తూ, క్వారంటైన్లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటినుంచే దృష్టిపెట్టాలన్నారు ముఖ్యమంత్రి YS జగన్మోహన్.
అలాగే వివిధ రాష్ట్రాలనుంచి వస్తున్నవారి విషయంలో కూడా సరైన విధానాన్ని అనుసరించాలని అ«ధికారులను ఆదేశించిన సీఎం, ఇందుకు సన్నద్ధం కావాలని ఆదేశిస్తూ విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్ కోవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్ విధించాలని, అలాగే గుజరాత్ నుంచి విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్ శాంపిల్స్ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని, అలాగే శ్రీకాకుళం చేరుకునేవారికి కూడా సెంటర్లు ఏర్పాటుచేసి, పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామన్నారు.
రాష్ట్రంలో లక్ష దాటిన కోవిడ్-19 పరీక్షలు, ప్రతి మిలియన్కు 2వేలకు చేరువలో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,02,460 కోవిడ్-19 పరీక్షలు, నిన్న ఒక్కరోజే 7902 పరీక్షలు, ప్రతిమిలియన్కు 1919 చొప్పున పరీక్షలతో దేశంలోనే అగ్రస్థానం. ప్రతి మిలియన్కు 2వేలకు చేరువలో పరీక్షలు జరిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు, 79 వెరీ యాక్టివ్ క్లస్టర్లు, 68 యాక్టివ్ క్లస్టర్లు, 53 డార్మంట్ క్లస్టర్లు, 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని వెల్లడించారు.
కోవిడ్-19 మరణాలు తగ్గించేందుకు వ్యూహం:
కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు, మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని, వీరిలో 4వేల మంది హైరిస్క్ ఉన్నవారిగా గుర్తించగా, వీరికి పరీక్షలు చేసి లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించాలని, కోవిడ్ కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నమన్నారు.
జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయించాలని CM ఆదేశాలు ఇచ్చారు. హైరిస్క్ ఉన్నవారు శ్వాసకోసతో సంబంధిత సమస్యలతోగాని, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఈ నంబర్లకు కాల్ చేస్తే.. వెంటనే వైద్యం అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
టెలిమెడిసన్, విలేజ్ క్లినిక్, పీహెచ్సీల మధ్య సరైన సమన్వయం ఉండాలి. సీఎం జగన్మోహన్.
భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వైద్య వ్యవస్థగా తీర్చిదిద్దాలని, టెలీమెడిసిన్ద్వారా ప్రిస్కిప్షన్ పొందడం, అక్కడనుంచి నేరుగా విలేజ్ క్లినిక్ద్వారా మందులు సరఫరాచేయడం జరగాలన్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలు:
ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని, ఒక్క కృష్ణాజిల్లాలో సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నాసరే.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సరికాదన్నారు. చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దని, వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టంచేసారు. పంటలను రోడ్డుమీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవని, అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదని, చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాససింగ్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలన్నారు.
వచ్చే ఏడాది మళ్లీ ఈ పంటల విషయంలో మార్కెటింగ్ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని, రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయిలో వ్యవసాయ సలహామండళ్లు ఏర్పాటు చేయబోతున్నారు. రైతు భరోసా కేంద్రాలకు నెట్, విద్యుత్ సహా అన్ని సౌకర్యాలను వెంటనే కల్పించాలని, ఏ ఊరిలో ఏ పంట వేయాలన్న విషయాన్ని ఆర్బీకేల ద్వారా అవగాహన కలిగించాలని, ఏ పంట వేస్తే మార్కెట్లో మంచి ధరకు అమ్ముడు పోయే అవకాశాలున్నాయన్నదానిపై రైతులకు అవగాహన కలిగించాలని, ప్రతి ఊర్లోకూడా ఏయే పంటలు ఎంతమేర పండించాలన్నదానిపై రైతులతో కలిసి కూర్చుని నిర్ణయించుకోవాలని, జాతీయ అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి.. సీఎం జగన్మోహన్ ఆమేరకు కార్యాచరణ ఉండాలన్నారు.
రాష్ట్రస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు, జిల్లా అడ్వైజరీ బోర్డులు, మండల అడ్వైజరీ బోర్డులు ఏర్పాటుకు చేయాలని, ఏయే పంటలు, ఎక్కడ ఎంతమేర సాగుచేయాలన్నదానిపై ఈ బోర్డులు సలహాలు ఇవ్వాలి. ఈ బోర్డుల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, రాష్ట్రస్థాయి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులు, జిల్లా స్థాయి బోర్డులకు, అక్కడనుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలి. పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలి, దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతోంది. పంటలను ఇ–క్రాపింగ్ చేయడం, రైతు భరోసాకేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం ఈప్రక్రియలన్నీ వ్యవస్థీకృతంగా సాగిపోవాలి. గత ప్రభుత్వం హయాంలో ఏరోజూ వ్యవసాయం మీద దృష్టిపెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టి విస్తృతంగా సమీక్షించుకుంటున్నాం. ఇంత చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ ఖచ్చితంగా ఫలితాలు రావాలని ఆదేశించారు.