జపాన్ ఒలింపిక్స్-2020 వాయిదా:IOC
ప్రపంచ వ్యాప్తంగా 3.5 లక్షల కేసులు, భారతదేశంలో 360 కేసులు ప్రతి దేశంలో రోజురోజుకు కరోనా కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 14657 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), నిర్వాహణ దేశం జపాన్ పునరాలోచనలో పడింది. ఐఓసీ టోక్యోలో
జులై 24న ఒలింపిక్స్ వాయిదా వేసింది.
గత నెలలో చైనా నుంచి వచ్చిన ఓడను దేశంలోకి రానివ్వడానికే ఆంక్షలు విధించారు అంతేకాకుండా జపానీయులకు పరిశుభ్రత-ఆరోగ్యంపై జాగ్రత్తలు
చాలా ఎక్కువగా తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు
కరోనా కాటుకు బలవ్వకుండా క్రీడల నిర్వహణ ఎలా?
ఏమి చేయాలనే విషయంపై జపాన్ ప్రభుత్వానికి, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి కంటిమీద కునుకే
లేకుండా పోయింది. అందుకే షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిపేందుకు వీలులేకపోవడంతో ఐఓసీ వాయిదా వేసింది.
విశ్వనగరాలే 24/7 లాక్డౌన్ అవుతుండటం ప్రజారవాణా స్తంభించడం, ఐదు మంది కూడా గుమిగూడే పరిస్థితులే
లేకపోవడం, కార్యాలయాలు మూటపడటం, జనమంతా ఇంటికే పరిమితం అవడంలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో టోక్యో ఒలింపిక్స్ ‘వాయిదా’ విషయం వెల్లడించారు.
భూగోళం కాలమానమే స్తంభించింది. ప్రతిష్టంభన ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలవుతోంది. సామాన్యులు అన్నామో రామచంద్ర అనే తీవ్రమైన పరిస్థితులు దాపురిస్తున్నాయి. నేలపై మానవుని ఉనికికే ప్రమాదం వచ్చింది. ఇప్పటికి కరోనాకు మందు కూడా కనుగొనలేదు అలాంటిది ఆటలు ఆడటం అవసరమా?
ఈ ప్రశ్నలతో ఐఓసీ ఓ నిర్ణయానికి రావడంతో వాయిదా ప్రకటించారు. అంతర్జాతీయ క్రీడల క్యాలెండర్ బిజీబిజీగా ఉండటం, 2021 సమ్మర్ సీజన్ ఏమాత్రం ఖాళీ లేక పోవడం, 2022 ఫుట్బాల్ ప్రపంచకప్, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లతో ఖరారై ఉన్నాయి.