కోవిడ్ 19 మహామ్మారి విస్తరణ – దాని నిలువరణ కోసం అమలు చేస్తోన్న లాక్ డౌన్ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు 2005 సెక్షన్ 38 (2) (1), ఎపిడమిక్ డిసీజ్ యాక్టు 1897 ల ప్రకారం సంక్రమించిన అధికారాల మేరకు మార్చి, 2020 నెల నుంచి మూడు నెలలపాటు ఇళ్ల అద్దె వసూలు చేయరాదని యజమానులకు ప్రభుత్వ ఆదేశం.
మూడు నెలల తరువాత ఆ మొత్తాన్ని సులభ వాయిదాల్లో తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.
ఈ మూడు నెలల అద్దె బకాయిలకు యజమానులు ఎలాంటి వడ్డీని వసూలు చేయకూడదని ఆదేశం.
ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎపిడమిక్ డిసీజ్ యాక్టు 1897, సెక్షన్ 3 ప్రకారం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు 2005 సెక్షన్ 51 నుంచి 58 ల మేరకు కఠిన చర్యలు.