ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి రిజిస్ట్రేషన్ సేవలు వస్తున్నాయి. గ్రీన్ జోన్లలో 108 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. లాక్ డౌన్ తరువాత తొలిరోజు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి రూ. కోటి ఆదాయం వచ్చింది. మొత్తం 633 డాక్యుమెంట్ లకు రిజిస్ట్రేషన్లయ్యాయి.లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 23 నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు, ఆంక్షల సడలింపుతో కంటైన్మెంట్ జోన్ల వెలుపల వున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నివారణ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు, సబ్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ), జిల్లా రిజిస్ట్రార్ (డీఆర్), డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఆఫీసుల్లో అందుబాటులో సాధారణ సేవలు అలాగే కరోనా నియంత్రణ లో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భౌతిక దూరం ఆంక్షలు విధించారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల సిబ్బంది, సేవల కోసం వచ్చే వారికి మాస్కులు తప్పనిసరి చేసారు. ముందు వచ్చిన వారికి తొలి ప్రాతిపదికన అవసరమైతే టోకెన్లు జారీ చేసి పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) దస్తావేజులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బయోమెట్రిక్ యంత్రాలను వినియోగించిన ప్రతిసారీ శానిటైజ్ చేస్తున్న సిబ్బంది, వేలిముద్రలు, స్టాంపు పేపర్లు తీసుకునేప్పుడు, చేతులు శానిటైజేషన్ చేసుకోవాలని సిద్దార్ధాజైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ అండ్ ఐజి సూచించారు.